YS Jagan: శ్రీకాళహస్తిలో జగన్‌కూ ఓ దేవాలయం.. రూ. 2 కోట్లతో నిర్మించిన వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

 Temple to Jagan in Srikalahasti at a cost of Rs 2 Cr
షార్ట్స్‌లో చూడండి
శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి 2 కోట్ల రూపాయల ఖర్చుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఓ గుడి కట్టించారు. 'నవరత్నాల నిలయం' పేరుతో నిర్మించిన ఈ ఆలయంలో జగన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రైతు భరోసా, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఇళ్ల స్థలాల పేరుతో స్తూపాలు కూడా నిర్మించారు.

భారీగా నిర్మించిన ఈ ఆలయంలో హుండీ కూడా ఏర్పాటు చేయడం విశేషం. అయితే, ఈ హుండీలో కానుకలకు బదులు సమస్యలు, విజ్ఞప్తులను సమర్పించుకోవచ్చు. ప్రసాదాలుగా ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలు అందిస్తారు. జగనన్న నవరత్నాల నిలయాన్ని తిరుపతి పార్లమెంటు సభ్యుడు ఎం.గురుమూర్తి ప్రారంభించారు.

Go Back to Shorts
YS Jagan
Temple
Srikalahasti
Madhusudhan Reddy

More Telugu News