లార్డ్స్ టెస్టు: రెండో ఇన్నింగ్స్ లో 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్
- లార్డ్స్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
- స్వల్ప స్కోరుకే అవుటైన రాహుల్
- రోహిత్ (21), కోహ్లీ (20) కూడా అవుట్
- మార్క్ ఉడ్ కు 2 వికెట్లు
- శామ్ కరన్ కు ఓ వికెట్
ఈ టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 391 పరుగులు చేసి 27 పరుగులు ఆధిక్యం పొందింది. ఆటకు రేపు ఆఖరి రోజు. దాంతో భారత్ కనీసం 200 పైచిలుకు లక్ష్యం నిర్దేశిస్తేనే ఈ మ్యాచ్ లో సురక్షితమైన స్థితిలో ఉంటుంది. ఒకవేళ సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచితే దాన్ని కాపాడుకోవడానికి టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.