సర్కారు వారి పాట, పుష్ప చిత్రాల కంటెట్ లీక్ అవడం పట్ల మైత్రీ మూవీ మేకర్స్ స్పందన
- సర్కారు వారి పాట, పుష్ప చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ సంస్థ
- కంటెంట్ ఆన్ లైన్ లో లీక్ అయిందని వెల్లడి
- సైబర్ పోలీసులకు ఫిర్యాదు
- లీక్ అయిన కంటెంట్ ను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి
కొందరు ప్రబుద్ధులు తమ కంటెంట్ ను లీక్ చేయడం ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నారని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ తరహా ధోరణితో తమను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ప్రేక్షకులకు అందాల్సిన థ్రిల్ ను చంపేస్తున్నారని వివరించింది. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని మైత్రీ మూవీ మేకర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఘటనలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పేర్కొంది.
ఈ అంశాన్ని సైబర్ క్రైమ్ విభాగం దృష్టికి తీసుకెళ్లామని, నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని వెల్లడించింది. ఇలాంటి పైరసీ కంటెంట్ ను ప్రోత్సహించవద్దని ప్రేక్షకులకు సవినయంగా మనవి చేస్తున్నామని తెలిపింది.