ఆఫ్ఘన్ లో తాలిబాన్ల దురాక్రమణపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన
- ఆఫ్ఘనిస్థాన్ పై తాలిబాన్ల పట్టు
- కాబూల్ తప్ప మిగతా భూభాగం వశం
- సరిహద్దులన్నీ తాలిబాన్ల స్వాధీనం
- సరిహద్దుల్లో భద్రత పెంచిన టర్కీ, ఇరాన్
అటు, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులన్నీ తాలిబాన్ల వశమయ్యాయి. ఈ నేపథ్యంలో టర్కీ, ఇరాన్ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. తాలిబాన్ల భయంతో దేశం వీడుతున్న ఆఫ్ఘన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో సరిహద్దులు దాటి వస్తున్న శరణార్థులను అడ్డుకునేందుకు టర్కీ, ఇరాన్ చర్యలు తీసుకుంటున్నాయి.