నిరక్షరాస్యత, పేదరికం, సాంఘిక అసమానతలు లేని దేశం ఆవిష్కృతం కావాలి: పవన్ కల్యాణ్
- స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్
- భారతావనికి మధురఘట్టం అని వెల్లడి
- త్యాగధనులకు నీరాజనాలు
- సుసంపన్న భారత్ కోసం ఆకాంక్ష
"ఎన్నో అవాంతరాలు, మరెన్నో విలయాలను అధిగమిస్తూ ఎందరో మేధావులు, రాజనీతిజ్ఞులు, కవులు, కళాకారులు, కోట్లాది మంది కార్మిక కర్షకులను భారత్ ఈ ప్రపంచానికి అందిస్తూనే ఉంది. శతవార్షిక స్వాతంత్ర్య దినోత్సవం నాటికి నిరక్షరాస్యత, పేదరికం, సాంఘిక అసమానతలు లేని దేశంగా భారత్ రూపుదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. నా తరఫున, జనసేన తరఫున భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.