భారత ఒలింపిక్ బృందానికి రాష్ట్రపతి భవన్ లో ఆతిథ్యం.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో సమావేశం
- టోక్యో ఒలింపిక్స్ లో భారత్ 7 పతకాలు
- గతంతో పోల్చితే మెరుగైన ప్రదర్శన
- అథ్లెట్లకు రాష్ట్రపతిభవన్ లో తేనేటి విందు
- అథ్లెట్లను అభినందించిన రాష్ట్రపతి
రామ్ నాథ్ కోవింద్, వెంకయ్య భారత అథ్లెట్లను పరిచయం చేసుకుని వారితో ముచ్చటించారు. భారత ఒలింపియన్ల ప్రదర్శన పట్ల యావత్ భారతావని గర్విస్తోందని, దేశానికి వన్నె తెచ్చారని కోవింద్ కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో పతకాలు గెలిచిన నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, రవి దహియా, భజరంగ్ పునియా, పీవీ సింధు, లవ్లీనా బొర్గోహైన్, భారత పురుషుల హాకీ జట్టు సభ్యులు, అమోఘ ప్రదర్శన చేసిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులు సహా ఇతర ఒలింపియన్లు పాల్గొన్నారు.