ఢిల్లీలో భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు
- ఎల్లుండి స్వాతంత్ర్య దినోత్సవం
- ఉగ్రవాదుల కుట్రపై నిఘా వర్గాల హెచ్చరిక
- అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు
- నలుగురి అరెస్ట్.. 55 తుపాకుల స్వాధీనం
అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరు ఢిల్లీ వాసి కాగా, మిగిలిన వారు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు. నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. డ్రోన్లు, బెలూన్లపై నిషేధం విధించారు.