Raghu Rama Krishna Raju: విజ‌య‌సాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే వ‌దిలిపెడుతూ సీబీఐ మెమో దాఖ‌లు

  • విచక్షణాధికారాల‌ మేరకు నిర్ణయం తీసుకోవాలన్న సీబీఐ
  • కౌంటర్‌ దాఖలకు గడువు కావాలన్న‌ విజయసాయి 
  • తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా  
trail in cbi court on raghurama petition

అక్ర‌మాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణ‌రాజు దాఖ‌లు చేసిన‌ పిటిషన్ పై ఈ రోజు సీబీఐ కోర్టు  విచార‌ణ జ‌ర‌పింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా విజయసాయిరెడ్డికి, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసి ర‌ఘురామ వేసిన‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఇటీవ‌ల‌ ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు సీబీఐ త‌మ అభిప్రాయాన్ని తెలిపింది.

బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే వదిలిపెడుతున్న‌ట్లు సీబీఐ  మెమో దాఖ‌లు చేసింది. కోర్టు విచక్షణాధికారాల‌ మేరకు  ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని కోరింది. అయితే,   సీబీఐ నిర్ణయంపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని విజయసాయిరెడ్డి కోర్టును కోరారు. దీంతో పిటిషన్‌పై తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ  రఘురామ కృష్ణ‌రాజు పిటిషన్ వేసిన విష‌యం తెలిసిందే.

More Telugu News