తన ట్విట్టర్ ఖాతాను లాక్ చేయడంపై రాహుల్ గాంధీ స్పందన
- ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది
- పార్లమెంటులోనూ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వట్లేదు
- మీడియానూ నియంత్రిస్తున్నారు
- కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే ట్విట్టర్ అదే వింటోంది
ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని రాహుల్ అన్నారు. పార్లమెంటులోనూ మాట్లాడేందుకు తమకు అనుమతి ఇవ్వట్లేదని, మీడియానూ నియంత్రిస్తున్నారని చెప్పారు. కనీసం ట్విట్టర్లోనైనా మన ఆలోచనలు పంచుకునేందుకు అవకాశం ఉందని భావించామని, కానీ, ఆ సామాజిక మాధ్యమం కూడా కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అదే వింటోందని ఆయన విమర్శించారు. ట్విట్టర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.