టోక్యో పారా ఒలింపిక్స్ కు భారత బృందం పయనం
- ఇటీవల ముగిసిన టోక్యో వేసవి ఒలింపిక్ క్రీడలు
- అదే వేదికపై దివ్యాంగులకు ఒలింపిక్స్
- ఈ నెల 24 నుంచి సెప్టెంబరు 5 వరకు పోటీలు
- భారత్ బృందంలో 54 మంది క్రీడాకారులు
- 9 క్రీడాంశాల్లో పోటీపడనున్న భారత్
పారా ఒలింపిక్ క్రీడల్లో భారత ఆటగాళ్లు 9 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. ఓపెనింగ్ సెర్మనీలో భారత క్రీడాకారుడు మరియప్పన్ త్రివర్ణ పతాకాన్ని చేతబూని మార్చ్ పాస్ట్ చేయనున్నాడు. కాగా, టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత్ పాల్గొనే క్రీడాంశాలు ఈ నెల 27 నుంచి షురూ కానున్నాయి. తొలుత భారత క్రీడాకారులు ఆర్చరీలో పోటీ పడతారు.
కాగా, టోక్యో పారా ఒలింపిక్ క్రీడలను భారత్ లో యూరోస్పోర్ట్ ఇండియా, డీడీ స్పోర్ట్స్ చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.