గతంలో బ్రెయిన్ ట్యూమర్ కు 11 సర్జరీలు, ఇప్పుడు కరోనా... ఓ మలయాళ నటి విషాదాంతం
- నటి శరణ్య శశి కన్నుమూత
- పదేళ్ల కిందట బ్రెయిన్ ట్యూమర్
- ఆదుకున్న చిత్ర పరిశ్రమ
- ఇటీవల కరోనా పాజిటివ్
- న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరిక
- చికిత్స పొందుతూ మృతి
పలు సినిమాలు, టీవీ సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్న శరణ్య శశి పదేళ్ల కిందట బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడ్డారు. చికిత్సలో భాగంగా వైద్యులు ఆమెకు 11 పర్యాయాలు ఆపరేషన్ చేశారు. ఓ దశలో ఆమె చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులకు గురికావడంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఆదుకుంది. కానీ, కరోనా రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఆమె మృతి పట్ల చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.