Jammu And Kashmir: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల కాల్పులు.. పోలీసు మృతి.. రాంబ‌వ్ జిల్లాలో బాంబు పేలుడు క‌ల‌క‌లం

  • కుల్గాంలో ట్రాఫిక్ నియంత్ర‌ణ ప‌నుల్లో ఉన్న పోలీసులపై కాల్పులు
  • మ‌రో ఇద్ద‌రు పోలీసుల‌కు తీవ్ర‌గాయాలు
  • బాంబు పేలుడుతో బాలుడితో పాటు మరో పౌరుడికి తీవ్ర‌గాయాలు
bomb blast in jk

జ‌మ్మూక‌శ్మీర్‌లో ఓ వైపు జాతీయ ద‌ర్యాప్తు బృందం విస్తృతంగా త‌నిఖీలు చేప‌డుతుండ‌గా మ‌రోవైపు ఉగ్ర‌వాదులు కాల్పులకు తెగ‌బ‌డ్డారు. కుల్గాంలో ట్రాఫిక్ నియంత్ర‌ణ ప‌నుల్లో ఉన్న పోలీసులపై ఉగ్ర‌వాదులు కాల్పులకు పాల్ప‌డ‌డంతో ఓ పోలీసు వీర‌మ‌ర‌ణం చెందారు. కాల్పుల ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్ద‌రు పోలీసుల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌తో అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఉగ్ర‌వాదుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

మ‌రోవైపు,  జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాంబ‌వ్ జిల్లాలో బాంబు పేలుడు క‌ల‌క‌లం సృష్టించింది. జాతీయ ర‌హ‌దారి స‌మీపంలో జ‌రిగిన ఈ పేలుడు ధాటికి ఓ బాలుడితో పాటు మరో పౌరుడికి తీవ్ర‌గాయాల‌య్యాయి.  దీంతో వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన భ‌ద్ర‌తా సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.

More Telugu News