జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు
- ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు సంబంధించిన కేసులో తనిఖీలు
- ఎన్ఐఏ ఆధ్వర్యంలో 14 జిల్లాల్లోని 45 ప్రాంతాల్లో సోదాలు
- నిషేధిత జమాతే ఇస్లామీ సభ్యుల నివాసాల్లో కీలక పత్రాలు స్వాధీనం
జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బృందాలు కూడా ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి. పలు ప్రాంతాల్లో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్లో జమాతే పాకిస్థాన్ అనుకూల కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే, అక్కడ పలు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నట్లు ఇటీవల వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.