Joe Root: టీమిండియాతో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ సెంచరీ

  • నాటింగ్ హామ్ లో రూట్ అద్భుత ప్రదర్శన
  • రెండో ఇన్నింగ్స్ లో 109 రన్స్ చేసిన రూట్
  • ఇంగ్లండ్ కు 190 పరుగుల ఆధిక్యం
  • మరొక్క రోజు ఆట మిగిలున్న వైనం
England captain Joe Root registered a fighting ton

టీమిండియాతో తొలి టెస్టులో ఇంగ్లండ్ సారథి జో రూట్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లో 109 పరుగులు చేసి ఇంగ్లండ్ కు ఓ మోస్తరు ఆధిక్యం లభించేందుకు దోహదపడ్డాడు. ఆటకు నాలుగోరోజున ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శామ్ కరన్ (29 బ్యాటింగ్), రాబిన్సన్ (6) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఆధిక్యం 190 పరుగులకు పెరిగింది. భారత బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయగా, భారత్ 278 పరుగులు చేసింది.

More Telugu News