England: నాటింగ్ హామ్ టెస్టు: లంచ్ వేళకు 24 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్

  • నాటింగ్ హామ్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • రెండో ఇన్నింగ్స్ లో 119-2 రన్స్ చేసిన ఇంగ్లండ్
  • 46 పరుగులకే 2 వికెట్లు డౌన్
  • ఆదుకున్న రూట్, సిబ్లీ
  • సిరాజ్, బుమ్రాకు చెరో వికెట్
England gets lead over Team Indian in Nottingham test

నాటింగ్ హామ్ లో భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ స్వల్ప ఆధిక్యం సాధించింది. ఇవాళ ఆటకు నాలుగోరోజు కాగా, ఓవర్ నైట్ స్కోరు 25/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ లంచ్ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 24 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఓ దశలో 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును కెప్టెన్ జో రూట్ (56 బ్యాటింగ్), ఓపెనర్ డామ్ సిబ్లీ (27 బ్యాటింగ్) జోడీ ఆదుకుంది. టీమిండియా బౌలర్లలో సిరాజ్, బుమ్రా చెరో వికెట్ తీశారు. ఈ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయగా, భారత్ 278 పరుగులు సాధించింది.

More Telugu News