Evaru Meelo Koteeswarulu: 'ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు' అంటోన్న ఎన్టీఆర్.. 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' ప్రోమో విడుద‌ల‌

  •  షోకి హోస్టుగా ఎన్టీఆర్‌
  •  రండి గెలుద్దాం అంటోన్న‌ ఎన్టీఆర్
  •  ఈ నెల నుంచే షో ప్రారంభం  
Evaru Meelo Koteeswarulu  Roaring this August

గ‌తంలో నాగార్జున‌, చిరంజీవి  'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అంటూ జెమినీ టీవీ షోలో అల‌రించిన విష‌యం తెలిసిందే. ఈసారి ఈ షో జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. 'రండి గెలుద్దాం... ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అంటూ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ డైలాగు చెప్పిన తొలి ప్రోమో కూడా ఇప్ప‌టికే విడుద‌లైంది. ఈ రోజు ఈ షో నుంచి మ‌రో ప్రోమో విడుద‌ల చేశారు.

'ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు' అంటూ ఈ కొత్త ప్రోమోలో ఎన్టీఆర్ మ‌రో డైలాగు చెప్పాడు. ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఎన్టీఆర్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్నాడు. ఈ ఆగ‌స్టులోనే ఈ షో గ‌ర్జిస్తుంద‌ని జెమినీ టీవీ పేర్కొంది. గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించాడు. ఇప్పుడు 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

 
             

More Telugu News