ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అధిగమించిన భారత్
- లంచ్ సమయానికి భారత్ 191-5
- ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 183
- 8 పరుగుల స్వల్ప ఆధిక్యంలో భారత్
- క్రీజులో కేఎల్ రాహుల్, జడేజా
కాగా, మూడో రోజ ఆట ఆరంభమైన కాసేపటికే వరుణుడు ప్రత్యక్షమైనా, కాసేపటికే కరుణించడంతో ఆట మళ్లీ మొదలైంది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ తో 25 పరుగులు చేసి రాబిన్సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా.... కేఎల్ రాహుల్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ 2, ఓల్లీ రాబిన్సన్ 2 వికెట్లు తీశారు.