అలీషాను కొట్టి చంపేశారు... వైసీపీ సర్కారు దాడుల నుంచి మైనారిటీలను రక్షించండి: నారా లోకేశ్
- గుంటూరు జిల్లాలో ఘటన
- మద్యం తరలిస్తున్నాడని కొట్టి చంపారన్న లోకేశ్
- కొట్టి చంపేంత నేరమా? అంటూ ఆగ్రహం
- రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్
అక్రమ మద్యం తరలించడం కొట్టి చంపేంత నేరమా? అని ప్రశ్నించారు. అలాగైతే, విషపూరితమైన సొంత మద్యాన్ని అత్యధిక ధరలకు విక్రయిస్తూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్ రెడ్డిది ఇంకెంత పెద్ద నేరమో ఎక్సైజ్ పోలీసులు చెప్పాలని నిలదీశారు. అలీషా హంతకులను ఉద్యోగాల నుంచి తొలగించాలని, అలీషా కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వైసీపీ సర్కారు దాడుల నుంచి మైనారిటీలను కాపాడాలని స్పష్టం చేశారు.