PV Sindhu: విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న పీవీ సింధు

  • ఆలయంలో ప్రత్యేక పూజలు
  • పీవీ సింధుకు వేదాశీర్వచనం చేసిన పండితులు
  • ఒలింపిక్స్‌కు వెళ్లేముందూ దుర్గమ్మను దర్శించుకున్న సింధు
  • అమ్మవారి ఆశీస్సులతో పోటీల్లో పతకం సాధించాన‌ని వ్యాఖ్య‌
sindhu visits indrakeeladri

భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి ద‌ర్శించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన‌ అనంతరం పండితులు పీవీ సింధుకు వేదాశీర్వచనం అందించారు.

ఆ త‌ర్వాత పీవీ సింధుకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లేముందు తాను క‌న‌క‌దుర్గమ్మను దర్శించుకున్నానని, అమ్మవారి ఆశీస్సులతో పోటీల్లో నెగ్గి పతకం సాధించాన‌ని చెప్పింది. తాను ప్యారిస్ ఒలింపిక్స్ లోనూ ఆడ‌తాన‌ని తెలిపింది.  

More Telugu News