ఒలింపిక్స్ రజతం సాధించిన రవికుమార్ కు రూ.4 కోట్ల నజరానా ప్రకటించిన హర్యానా ప్రభుత్వం
- టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం
- 57 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో రజతం
- పోరాడి ఓడిన రవి కుమార్ దహియా
- క్లాస్-1 ఉద్యోగం కూడా ఇస్తామన్న హర్యానా సర్కారు
అంతేకాదు, క్లాస్-1 ఉద్యోగం, 50 శాతం రాయితీతో స్థలం అందిస్తామని పేర్కొంది. రవి కుమార్ స్వస్థలం నహ్రీలో రెజ్లింగ్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సహకరిస్తామని వెల్లడించింది. అటు, రెజ్లర్ రవి కుమార్ దహియాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. టోక్యో ఒలింపిక్స్ లో రవి కుమార్ గొప్ప పోరాట పటిమ కనబర్చాడని కితాబిచ్చారు.