Congress: ఈ నెల 9న లక్షమందితో ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

  • దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో బహిరంగ సభ
  • 18 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుని ఏర్పాట్లు
  • 7న స్థలాన్ని సందర్శించనున్న నేతలు
Congress plans Huge public meeting in indravelli on august 9th

ఈ నెల 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సభ నిర్వహణ కోసం గ్రామంలో 18 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకున్న కాంగ్రెస్, సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 7న స్థలాన్ని సందర్శించనున్న కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ విప్ అనిల్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి తదితరులు నిన్న పీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించారు.

More Telugu News