లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు.. డిశ్చార్జ్ పిటిషన్ల దాఖలుకు గడువు కోరిన జగన్, విజయసాయి
- లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో జగన్ ప్రధాన నిందితుడు
- గీతారెడ్డి, శామ్యూల్ పిటిషన్లపై విచారణ 16కు వాయిదా
- హైకోర్టులో స్టేలు లేని నిందితులు వాదనలకు సిద్ధంగా ఉండాలని సీబీఐ కోర్టు ఆదేశం
మరోవైపు, రాంకీ కేసులో మూడో నిందితుడైన అయోధ్యరామిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై నిన్న సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా పడింది. అలాగే, వాన్పిక్ దాల్మియా, అరబిందో-హెటిరో, జగతి పబ్లికేషన్స్ కేసుల విచారణ కూడా ఈ నెల 12కు వాయిదా పడింది. ఇందూ హౌసింగ్ బోర్డు కేసును కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. హైకోర్టులో స్టేలు లేని నిందితుల అభియోగాల విషయంలో వాదనలకు సిద్ధంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.