ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుకు ఢిల్లీలో ఘన స్వాగతం
- ఉమెన్స్ సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన సింధు
- వరుసగా రెండు ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన ఘనత
- ప్రధాని, కేంద్ర మంత్రులను కలవనున్న సింధు
వరుసగా రెండు ఒలింపిక్స్ లలో పతకాన్ని సాధించిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కాంస్య పతక పోరులో చైనాకి చెందిన హీ బింగ్ జివోతో జరిగిన మ్యాచ్ లో 21-13, 21-15 తేడాతో సింధు గెలుపొందింది. సింధు సాధించిన కాంస్య పతకంతో భారత్ పతకాల సంఖ్య రెండుకు చేరుకుంది.