ఏపీలో కొత్తగా 2,287 కరోనా పాజిటివ్ కేసులు
- ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 85,856 కరోనా టెస్టులు
- తూర్పు గోదావరి జిల్లాలో 410 కేసులు
- రాష్ట్రంలో 18 మంది మృతి
- ఇంకా 21,019 మందికి చికిత్స
అదే సమయంలో 2,430 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,395కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,68,462 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,34,048 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 21,019 మంది చికిత్స పొందుతున్నారు.