Sangareddy District: పొలం దున్నుతుండగా బయటపడిన భారీ గణపతి విగ్రహం

  • సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో ఘటన
  • ట్రాక్టరుతో పొలం దున్నిస్తుండగా నాగలికి తాకి బయటపడిన వైనం
  • చూసేందుకు తరలివస్తున్న ప్రజలు
Lord Ganapathi huge idol came from farm Land in sangareddy dist

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఓ పొలం నుంచి విఘ్నేశ్వరుడి భారీ విగ్రహం ఒకటి బయటపడింది.  జిల్లాలోని నారాయణఖేడ్ మండలం తుర్కపల్లికి చెందిన అనంతరావు దేశ్‌ముఖ్ అనే రైతు పంట సాగు కోసం నిన్న సాయంత్రం ట్రాక్టర్‌తో పొలం దున్నించారు.

ఈ క్రమంలో ట్రాక్టర్ నాగలికి తగిలి గణేశుడి విగ్రహంతోపాటు దానిని ప్రతిష్ఠించే భారీ పీఠం బయటపడ్డాయి. విషయం తెలిసిన గ్రామస్థులు విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది.

More Telugu News