సింధు దూకుడుగా ఆడేందుకు తై జు అవకాశం ఇవ్వలేదు: తండ్రి పీవీ రమణ
- టోక్యో ఒలింపిక్స్ లో సింధుకు నిరాశ
- బ్యాడ్మింటన్ సెమీస్ లో ఓటమి
- వరుస గేముల్లో నెగ్గిన తై జు యింగ్
- కుమార్తె ఓటమిపై స్పందించిన పీవీ రమణ
సెమీఫైనల్ మ్యాచ్ లో తై జు యింగ్ ఎంతో వ్యూహాత్మకంగా ఆడిందని తెలిపారు. తొలి గేమ్ ను గెలిచిన ఊపుతో ఆమె రెండో గేమ్ ను మరింత ఉత్సాహంగా ఆడిందని వెల్లడించారు. ఈ మ్యాచ్ లో ఎక్కువ సేపు ర్యాలీలు ఆడకుండా తై జు జాగ్రత్త పడిందని వివరించారు. సింధు రేపు బాగా ఆడి కాంస్యం తీసుకువస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. సింధు కోచ్ పై సంతృప్తికరంగానే ఉన్నామని పీవీ రమణ స్పష్టం చేశారు.
సిందు ఈ మధ్యాహ్నం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్ పోరులో వరుస గేముల్లో తై జు యింగ్ కు తలవంచింది. గత ఒలింపిక్స్ లో తనను ఓడించిన సింధుపై ఈ ఓటమి ద్వారా తై జు ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఇక, రేపు కాంస్యం కోసం జరిగే పోరులో సింధు... చైనాకు చెందిన హి బింగ్ జియావోతో తలపడనుంది.