టీమిండియాలో మరో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా
- లంక పర్యటన ముగించుకున్న భారత్
- తాజాగా చాహల్, కృష్ణప్ప గౌతమ్ కు కరోనా
- అంతకుముందే కృనాల్ పాండ్యకు పాజిటివ్
- ముగ్గురూ లంకలోనే ఉంటారన్న అధికారులు
- మిగిలిన ఆటగాళ్లు భారత్ రాక
లంకతో వన్డే సిరీస్ ను 2-1తో నెగ్గిన భారత్... 1-2తో టీ20 సిరీస్ ను చేజార్చుకుంది. శిఖర్ ధావన్ నేతృత్వంలో లంక పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ప్రతిభావంతులైన యువకులు ఉన్నా, కరోనా వ్యాప్తి రేపిన అలజడితో ఉత్సాహం లేనట్టుగా ఆడారు. టీ20 సిరీస్ ను అత్యంత పేలవమైన రీతిలో ఆడి లంకకు వరుసగా రెండు విజయాలు అప్పగించారు.