కేసీఆర్ ఫార్మ్ హౌస్ ను దున్ని, పేదలకు పంచుతాం: బండి సంజయ్
- ప్రగతి భవన్ ను కూల్చి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
- హుజూరాబాద్ లో జరుగుతున్నది కేసీఆర్ బైయింగ్ పోల్స్
- ఈటల బావమరిది తప్పుచేసినట్టైతే అరెస్ట్ ఎందుకు చేయలేదు?
హుజూరాబాద్ లో జరుగుతున్నది బైపోల్స్ కాదని... కేసీఆర్ బైయింగ్ పోల్స్ అని సంజయ్ మండిపడ్డారు. ఓటర్లను లోబరుచుకునేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక నేతలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత చేసినా బీజేపీ గెలుపును కేసీఆర్ అడ్డుకోలేరని అన్నారు.
ఈటల బావమరిది చాటింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఆయన నిజంగా తప్పు చేసినట్టైతే ఇంతవరకు అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని అన్నారు. గిరిజనుల పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేయిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు.