శ్రీకృష్ణుడి సేవ కోసం ఉద్యోగాన్ని వదులుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారిణి
- స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన భారతి అరోరా
- 23 ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిణిగా కొనసాగిన భారతి
- గురునానక్, తులసీదాస్ తదితరులు చూపిన మార్గంలో పయనిస్తానని వ్యాఖ్య
భారతీ అరోరా 23 ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిగా సేవలందించారు. ప్రస్తుతం ఆమె ఐజీ స్థాయిలో ఉన్నారు. తన కెరీర్ లో ఆమె ఎన్నో బాధ్యతలను నిర్వహించారు. సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు పేలుడు కేసు దర్యాప్తులో కూడా ఆమె పాలుపంచుకున్నారు. ఇన్నేళ్ల పాటు ఐసీఎస్ అధికారిగా సేవలందించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. స్వచ్ఛంద విరమణకు గల కారణాలను తన రాజీనామా లేఖలో స్పష్టంగా పేర్కొన్నానని తెలిపారు.