BJP: తృణమూల్ ఎంపీ తనను ‘బీహారీ గూండా’ అన్నారంటూ బీజేపీ ఎంపీ ఫిర్యాదు!

  • తన జీవితంలో మాట పడలేదన్న నిశికాంత్ దూబే
  • మహువా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • మీటింగ్ కే రాని వారిని ఎలా కామెంట్ చేస్తానన్న మహువా
  • కావాలంటే హాజరు పట్టిక చూసుకోవాలని సూచన
BJP MP Alleges He Has Called Bihari Gunda TMC MP Reaction Is This

తనను ‘బీహారీ గూండా’ అంటూ తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా కామెంట్ చేశారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. ఇవాళ పార్లమెంట్ లో చర్చ సందర్భంగా ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఐటీ పార్లమెంటరీ కమిటీ సమావేశం సందర్భంగా ఆమె తనపై ఆ వ్యాఖ్యలు చేశారని, తన జీవితంలో ఇలాంటి మాటలు ఎన్నడూ పడలేదని ఆయన అన్నారు. ఈ దేశాన్ని బాగు చేయాలనుకోవడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు.

తాము కూలి పనులు చేసుకుని పైకొచ్చామని, శ్రీరాముడి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ఆ విషయంపై స్పీకర్ కు మహువా మోయిత్రా మీద దూబే ఫిర్యాదు చేశారు. హిందీ వాళ్లంటే తృణమూల్ పార్టీ వారికి అసహ్యమని, అందుకే ఆ కామెంట్లు చేశారని ఆయన ఆరోపించారు. ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


అయితే, దీనిపై మహువా మోయిత్రా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు ఆశ్చర్యానికి గురి చేశాయని ఆమె అన్నారు. అసలు ఆ మీటింగ్ కే రాని వారి గురించి తానెలా అలాంటి వ్యాఖ్యలు చేస్తానని ప్రశ్నించారు. కావాలంటే మీటింగ్ కు ఎవరెవరొచ్చారో హాజరు పట్టికను తీసి చూసుకోవచ్చని చెప్పారు. కాంగ్రెస్ , తృణమూల్ పార్టీ ఎంపీలకు ఆ ట్వీట్ ను ఆమె ట్యాగ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News