Prabhas: 'రాధే శ్యామ్' నుంచి రానున్న అప్డేట్!

  • ప్రభాస్ తాజా చిత్రంగా 'రాధే శ్యామ్'
  • పునర్జన్మల నేపథ్యంలో సాగే కథ
  • పాన్ ఇండియా స్థాయిలో విడుదల
  • అందరిలో పెరుగుతున్న ఆసక్తి  
Radhe Shyam movie update

ప్రభాస్ - పూజ హెగ్డే నాయకా నాయికలుగా 'రాధే శ్యామ్' రూపొందింది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. విదేశీ నేపథ్యంలో సాగే పునర్జన్మలతో కూడిన ప్రేమకథ ఇది. పాన్ ఇండియా స్థాయి సినిమా కావడం .. గ్రాఫిక్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటం వలన, ఈ ప్రాజెక్టు ఎక్కువ సమయాన్ని తీసుకుంది.  

ఈ సినిమా పట్టాలెక్కిన దగ్గర నుంచి అప్ డేట్స్ పెద్దగా వదల్లేదు. చాలా సమయం తరువాత ఒకటి రెండు పోస్టర్లు వదిలారు. ఆ తరువాత కూడా అప్ డేట్స్ పరంగా మరింత గ్యాప్ తీసుకున్నారు. షూటింగు ఆలస్యం కావడం .. రీ షూట్లు జరుగుతున్నాయనే టాక్ రావడం కొంత అసహనానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

ఇక ఈ సినిమా నుంచి మూడు రోజుల్లో అప్ డేట్ ను వదలనున్నట్టు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చేశాడు. మరి ఆ అప్డేట్ ఏ రూపంలో ఉండనుందనేది చూడాలి. 'సాహో' తరువాత ప్రభాస్ నుంచి రానున్న సినిమా ఇదే. ఇక్కడి నుంచే ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల వరుస మొదలుకానుంది. దాంతో సహజంగానే అందరిలో ఆసక్తి మొదలవుతోంది.    

More Telugu News