గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ విజయం

YCP wins GVMC Standing Committee elections
  • నేడు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీకి ఎన్నికలు
  • మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్
  • ఆపై ఓట్ల లెక్కింపు
  • విజయం సాధించిన వైసీపీ కార్పొరేటర్లు
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ నిర్వహించగా, అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. 10 మంది వైసీపీ కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో విజయం అందుకున్నారు. మొత్తం 67 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 57 మంది వైసీపీకి చెందిన వారే కావడంతో ఆ పార్టీకి విజయం నల్లేరుపై నడకే అయింది.

ఓ నగరపాలక సంస్థకు స్టాండింగ్ కమిటీ ఎంతో కీలకమైనది. దీనికి మేయర్ నాయకత్వం వహిస్తారు. ఇందులో 10 మంది డైరెక్టర్లుగా కొనసాగుతారు. తాజా ఎన్నికల ద్వారా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అందరూ వైసీపీ కార్పొరేటర్లే గెలిచారు. కాగా, ఈ విజయంపై మంత్రి అవంతి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వెలిబుచ్చారు. పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
YSRCP
GVMC
Standing Committee
Elections
Visakhapatnam
Andhra Pradesh

More Telugu News