ఐపీఎల్ మిగిలిన భాగం షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
- భారత్ లో నిలిచిపోయిన ఐపీఎల్ పోటీలు
- కరోనా వ్యాప్తితో వాయిదా వేసిన బీసీసీఐ
- యూఏఈ గడ్డపై జరిపేలా రీషెడ్యూల్
- సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు పోటీలు
మొత్తం 27 రోజుల పాటు యూఏఈ గడ్డపై 31 ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. దుబాయ్ లో 13 మ్యాచ్ లు, షార్జాలో 10 మ్యాచ్ లు, అబుదాబిలో 8 మ్యాచ్ లు నిర్వహిస్తారు. లీగ్ పోటీల అనంతరం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ అక్టోబరు 10న దుబాయ్ వేదికగా జరగనుంది. అనంతరం షార్జా వేదికగా అక్టోబరు 11న ఎలిమినేటర్ మ్యాచ్, అక్టోబరు 13న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనున్నాయి. ఇక దుబాయ్ వేదికగా అక్టోబరు 15న నిర్వహించే ఫైనల్ మ్యాచ్ తో టోర్నీ ముగియనుంది.