ఘనంగా ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని
- కుటుంబ సభ్యులతో కలిసి బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని
- తెల్లవారుజాము నుంచే పెరిగిన భక్తుల దాడి
- కరోనా నుంచి బయటపడేలా చూడమని అమ్మవారిని కోరానన్న మంత్రి
- నేడు, రేపు ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
బోనాల జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. వేడుకలను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. బోనం సమర్పించిన అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రజలను చల్లగా చూడాలని, కరోనా బారి నుంచి బయటపడేలా అనుగ్రహించాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో మాస్కులు అందజేస్తున్నారు.