ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వెంకట్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి
- ఇటీవల కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్
- గాయపడిన వెంకట్ బల్మూర్
- పోలీసుల అత్యుత్సాహమే కారణమన్న రేవంత్
- డీజీపీకి, హెచ్చార్సీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి
పోలీసుల దుందుడుకు వైఖరి కారణంగానే వెంకట్ కు గాయాలు అయ్యాయని ఆరోపించారు. వెంకట్ పక్కటెముకలను లక్ష్యంగా చేసుకుని కొట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో వెంకట్ చురుగ్గా పాల్గొంటున్నందుకే అతనిని టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీకి, హెచ్చార్సీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాగా, వెంకట్ కు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను, పక్కటెముకల ఎక్స్ రేలను రేవంత్ ఈ సందర్భంగా పరిశీలించారు. వెంకట్ త్వరగా కోలుకుని, మళ్లీ చురుగ్గా కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.
