నేర చరిత్ర కలిగిన ఇద్దరు నాపై రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాశారు: రఘురామకృష్ణరాజు
- రూ.43 వేల కోట్లు దోచుకున్న వాళ్లని వ్యాఖ్య
- దొంగలంతా కలిసి ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు
- జులై 26న అన్నీ తేలతాయని స్పష్టీకరణ
- తాను కూడా రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాస్తానని ఉద్ఘాటన
తనపై ఇప్పుడు విమర్శలు చేస్తున్న వైసీపీ పెద్దలు అన్నీ తెలిసి తనకు ఎందుకు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. నాపై తమిళనాడులో కేసులకు సీఎం జగన్, బాలశౌరి కారణమని రఘురామ ఆరోపించారు. విశాఖను విజయసాయిరెడ్డి లూటీ చేస్తున్నారని, తాను కూడా రాష్ట్రపతి, ప్రధానికి వివరంగా లేఖ రాస్తానని చెప్పారు.