ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు సీఎం జగన్, చిరంజీవి శుభాకాంక్షలు
- టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం
- పరిపూర్ణ విజయం సాధించాలన్న సీఎం జగన్
- దేశాన్ని గర్వించేలా చేయాలని ఆకాంక్ష
- సహజ నైపుణ్యం చాటాలన్న చిరంజీవి
చిరంజీవి స్పందిస్తూ, 'టోక్యోలో ప్రారంభమైన విశ్వక్రీడోత్సవం ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత బృందానికి శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. 'భారత క్రీడాకారులు తమ సహజ ప్రతిభాపాటవాలు ప్రదర్శించి దేశానికి గర్వకారణం కావాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. స్వర్ణ పతకాలతో తిరిగిరావాలని ఆకాంక్షించారు.