Sensex: వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 138 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 32 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3 శాతానికి పైగా పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ షేర్
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండటం మన మార్కెట్లపై కూడా పాజిటివ్ ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 138 పాయింట్లు లాభపడి 52,975కి చేరుకుంది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 15,856 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (3.18%), ఐటీసీ లిమిటెడ్ (2.56%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.69%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.42%), యాక్సిస్ బ్యాంక్ (1.27%).

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-0.82%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.74%), ఎన్టీపీసీ (-0.67%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.55%), ఏసియన్ పెయింట్స్ (-0.54%).

More Telugu News