Vajra Busses: వేలానికి ‘వజ్ర’.. బస్సులను వదిలించుకోనున్న టీఎస్ఆర్టీసీ

  • ఇళ్ల వద్దే ప్రయాణికులను పికప్ చేసుకునేలా ‘వజ్ర’ సేవలు
  • ఆదరణ కరవవడంతో మూలనపడిన 65 బస్సులు
  • త్వరలోనే బహిరంగ వేలానికి టెండరు నోటిఫికేషన్
TSRTC Decided to sell Vajra Busses through Tender

ప్రయాణికుల ఆదరణకు నోచుకోని వజ్ర బస్సులను వదిలించుకోవాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఇళ్ల నుంచి ఎక్కించుకుని తీసుకెళ్లేలా ఈ బస్సులను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు నాన్‌స్టాప్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. 21 సీట్లు ఉన్న ఈ బస్సుల్లో యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టారు.

అయితే, సాధారణ బస్సులతో పోలిస్తే ఇందులో చార్జీలు దాదాపు రెండింతలు ఉండడంతో ప్రయాణికుల నుంచి ఆదరణ కరవైంది. వీటి నిర్వహణ భారంగా మారడంతో వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది.  ఈ బస్సులు 100 వరకు ఉండగా ఆదరణ కరవవడంతో 65 మూలనపడ్డాయి. ఈ నేపథ్యంలో స్క్రాప్ యార్డ్ విభాగం ద్వారా వాటి ప్రస్తుత విలువను అంచనా వేసి అనంతరం బహిరంగ వేలానికి టెండరు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు మూడు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది.

More Telugu News