'ఛలో రాజ్ భవన్' విజయవంతమైంది: రేవంత్ రెడ్డి
- దేశవ్యాప్తంగా పెగాసస్ ప్రకంపనలు
- కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు
- హైదరాబాదులో 'ఛలో రాజ్ భవన్'
- పోలీసుల తీరు ఆక్షేపణీయమన్న రేవంత్
వ్యక్తిగత గోప్యతకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్న విషయం పెగాసస్ వ్యవహారంతో స్పష్టమైందని రేవంత్ రెడ్డి అన్నారు. పెగాసస్ పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఆరితేరారని వ్యాఖ్యానించారు.