ఏపీలో కొత్తగా 1,843 కరోనా రోజువారీ కేసులు
- గత 24 గంటల్లో 70,727 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 301 కేసులు
- కర్నూలు జిల్లాలో 24 కేసులు
- రాష్ట్రంలో 12 మంది మృతి
- ఇంకా 23,571 మందికి చికిత్స
అదే సమయంలో 2,199 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,48,592 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,11,812 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 23,571 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,209కి పెరిగింది.