జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులపై ఏపీ ప్రభుత్వ స్పందన ఏంటి?: రఘురామకృష్ణరాజు
- రఘురామ మీడియా సమావేశం
- ఏపీ సర్కారుపై మాటల యుద్ధం
- ఎస్సీ కమిషన్ నోటీసుల అంశం ప్రస్తావన
- తాను గతంలోనూ దీని గురించి మాట్లాడానన్న రఘురామ
ఒకసారి ఎవరైనా మతం మారితే వారు బీసీ-సీ కేటగిరీలోకి వస్తారని రాజ్యాంగం చెబుతోందని వెల్లడించారు. అయితే మతం మారిన వారు కూడా ఎస్సీ రిజర్వేషన్లు పొందుతున్న అంశాన్ని నాగరాజు తదితరులు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనివల్ల దళిత హిందువులకు అన్యాయం జరుగుతోందని వారు కమిషన్ కు నివేదించినట్టు వివరించారు.
తాను రిజర్వేషన్లకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని ఎత్తిచూపడం వైసీపీ పెద్దలకు నచ్చినట్టు లేదని, అందుకే తనపై లోక్ సభ స్పీకర్ కు అందజేసిన అనర్హత పిటిషన్ లో పేజీలకు పేజీలు ఈ అంశాన్నే ప్రస్తావించారని రఘురామ ఆరోపించారు.