హుజూరాబాద్లో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల పోటీ: ఆర్.కృష్ణయ్య
- తొలగించిన 7600 మందిని విధుల్లోకి తీసుకోవాలి
- ధర్మదీక్షలో కేసీఆర్కు కృష్ణయ్య హెచ్చరిక
- 24న హైదరాబాద్లో అఖిలపక్ష సమావేశం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఈ హెచ్చరికలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమన్నారు. ఏ తప్పు చేశారని వారిని తొలగించారో కేసీఆర్ చెప్పాలన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 24న హైదరాబాద్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. ప్రశ్నించే గొంతులను కేసీఆర్ అణచివేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.