పొత్తుల రాజకీయాలు చేయడం జగన్ కు రాదు: సజ్జల
- వెనుకబడిన వర్గాల ఉనికిని కాపాడేందుకే 56 కార్పొరేషన్లు
- కుల రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలను వైసీపీ చేయదు
- ప్రతి సంక్షేమ పథకం ద్వారా ప్రజలు లబ్ధి పొందాలనేదే జగన్ లక్ష్యం
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.