హైదరాబాద్ నుంచి వెళుతున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిన వైనం!
- డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో తప్పిన ప్రమాదం
- వేరే బస్సులో వెళ్లిన ప్రయాణికులు
- యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి వద్ద ఘటన
అదే సమయంలో ఒక్కసారిగా బస్సు చక్రాలు ఊడిపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును చాకచక్యంగా ఆపడంతో ప్రమాదం తప్పింది. ఆ బస్సు హైదరాబాద్ నుంచి తొర్రూర్ బయలుదేరిందని డ్రైవర్ తెలిపాడు. దానికి ఫిట్నెస్ లేకపోవడంతోనే చక్రాలు ఊడిపోయాయని చెప్పాడు. ఈ ఘటన జరిగిన అనంతరం ప్రయాణికులను వేరే బస్సు ఎక్కించారు.