సముద్రంలో 15 మంది మత్స్యకారుల గల్లంతు... హోంశాఖ సహాయమంత్రిని కలిసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

Fishermen stuck in mid sea after their boat stranded
సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు గల్లంతయ్యారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ క్రమంలో మత్స్యకారుల ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 15 మంది మత్స్యకారులు గల్లంతయ్యారని, ఈ నెల 16న వారి బోటు సముద్రంలో ఆగిపోయిందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బోటులో సాంకేతిక లోపం వచ్చిందని కోస్ట్ గార్డ్ దళాలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారని పేర్కొన్నారు. మత్స్యకారులను రక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశానని తెలిపారు.
Go Back to Shorts
Fishermen
Srikakulam District
Sea
Kinjarapu Ram Mohan Naidu

More Telugu News