AP High Court: ఎస్ఈసీ నీలం సాహ్నీపై దాఖలైన పిటిషన్ విచారణ ఈ నెల 23కి వాయిదా

  • ఇటీవల ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకం
  • వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్
  • ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదన్న ఎస్ఈసీ న్యాయవాది
  • డివిజన్ బెంచ్ కు బదలాయించాలని విజ్ఞప్తి
High Court adjourned hearing against SEC

ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని ఎస్ఈసీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అందుకే ఈ విచారణను డివిజన్ బెంచ్ కు బదిలీ చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ఎన్నికల కమిషనర్ అంశాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చని పేర్కొంది.

ఈ క్రమంలో పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కిందికి వస్తుందని గతంలో పలు తీర్పులు ఉన్నాయని వెల్లడించారు. అయితే, గత తీర్పులను ఫైల్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.

More Telugu News