ముంబైలో దంచి కొడుతున్న వాన.. రెడ్ అలర్ట్ జారీ
- మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
- జలమయమైన పలు ప్రాంతాలు
- రైల్వే సర్వీసులకు కూడా అంతరాయం
భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలో 407 శిథిల భవనాలను నగర మున్సిపల్ కార్పొరేషన్ ఇంతకు ముందే గుర్తించింది. అయితే, వాటిలో ఇప్పటి వరకు 150 భవనాలను మాత్రమే కూల్చింది. మరోవైపు మహారాష్ట్ర-గోవా సముద్ర తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ముంబై ఓడరేవు అధికారులు హెచ్చరించారు. అవి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.