కఠిన ప్రశ్నలు ఎన్నైనా వేయండి.. కానీ, మమ్మల్ని మాట్లాడనివ్వండి: విపక్షాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
- క్రమశిక్షణతో మెలగాలని హితవు
- టీకాతో ‘బాహుబలి’ అవ్వాలని ప్రజలకు పిలుపు
- 40 కోట్ల మంది బాహుబలులయ్యారని చమత్కారం
వ్యాక్సినేషన్ పైనా తనదైన శైలిలో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారంతా బాహుబలులేనని చమత్కరించారు. ‘‘టీకాను భుజాలకు (బాహువు) వేస్తారు. కాబట్టి, టీకాలేసుకున్న వారంతా బాహుబలులు. ఇప్పటికే 40 కోట్ల మంది బాహుబలులయ్యారు. మిగతా వారూ టీకా తీసుకుని బాహుబలి అవ్వాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి గుప్పిట పట్టేసిందని, సభలో దానిపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.