కొలంబోలో గెలుపు దిశగా టీమిండియా
- శ్రీలంకతో తొలి వన్డే
- టీమిండియా టార్గెట్ 263 రన్స్
- ప్రస్తుతం భారత్ స్కోరు 15 ఓవర్లలో 127/1
- విజయానికి 136 పరుగులు అవసరం
- చేతిలో 9 వికెట్లు
- పృథ్వీషా, ఇషాన్ కిషన్ దూకుడు
ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. కిషన్ 35 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సులతో 54 పరుగులు సాధించడం విశేషం. ఐపీఎల్ ఆడిన అనుభవంతో రాటుదేలిన భారత బ్యాట్స్ మెన్ ముందు తొలి పవర్ ప్లేలో శ్రీలంక కుర్ర బౌలర్లు తేలిపోయారు.
అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది.